ఐకెపి ఉద్యోగుల పాదయాత్ర

ఐకెపి ఉద్యోగుల పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న ఐకెపి వి ఓ ఏ లు సోమవారం నిర్మల్ బై పాస్ రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమకు రావాల్సిన అభయ హస్తం డబ్బులు చెల్లించాలని, అర్హులైన వారికి సి సి లుగా పదోన్నతులు కల్పించటం వారి డిమాండ్లలో ఉన్నాయి.