జర్నలిస్టులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు

నంగునూర్, ముద్ర:సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో మాతృవియోగంతో బాధపడుతున్న జర్నలిస్టులను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు  జర్నలిస్టులు పంగ లింగం , పంగ రవి ల తల్లి గౌరవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న రాష్ట్రమంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం రాత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ వేణు చక్రవర్తి ,సర్పంచ్ కుమార్  ఉప సర్పంచ్ ఓజాల్  నాయకులు పరమేశ్వర్, రాజయ్య, వెంకట్  తదితరులు పాల్గొన్నారు.