దటీజ్ గుంటకండ్ల  ఫ్యామిలీ!

దటీజ్ గుంటకండ్ల  ఫ్యామిలీ!
  • కౌన్సిలర్ నిర్లక్ష్యం తో  రోడ్డు ను అలుముకున్న చెట్లు
  • 10 వ వార్డ్ ప్రచారం సందర్బంగా పిల్లలమర్రి యాదవ నగర్ లో సునిత జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు
  • నిమిషాలలో నే సుందరంగా మారిపోయిన రహదారి
  • ఆనందం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కు జై కొట్టిన యాదవ సోదరులు
  • "పతి" కి తగిన "సతి" అంటూ  కితాబు 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందంజ లో ఉంచిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇక్కడ ప్రజల హృదయాల్లో సముచిత స్థానం పొందిన విషయం తెలిసిందే. సమస్యను పరిష్కరించడం లో పతికి తగిన సతి అనిపించుకుంది ఆయన సతీమణి సునిత జగదీష్ రెడ్డి. రాబోయే ఎన్నికల ప్రచారం లో భాగంగా జగదీష్  రెడ్డి  గారి కి మద్దతు గా పిల్లల మర్రి 10 వ వార్డ్ , యాదవ నగర్ కాలనీ కి వెళ్ళింది. కొంత కాలంగా అక్కడ కౌన్సిలర్ ప్రజలకు అందుబాటులో లేడు.. దీంతో యాదవ నగర్ కాలనీ లో రహదారులకు ముళ్ళ చెట్లు అవహించి వచ్చి పోయే వారుతీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.. విషయాన్ని యాదవ సోదరులు సునీత జగదీష్ రెడ్డి గారికి  తీసుకురాగా వెంటనే స్పందించిన ఆమె నిమిషాల వ్యవధిలో రహదారి పై ఆవహించిన కంప చెట్ల ను జేసిబి తో తొలగించి ఆధునిక రించారు. నిమిషాలలో నే సుందరంగా మారిపోయిన రహదారి ని చూసి మురిసిపోయిన యాదవ సోదరులు ఆనందం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కు జై కొట్టారు.
"పతి" కి తగిన "సతి" అంటూ  కితాబు ఇచ్చి ప్రశంసలతో ముంచెత్తారు.