సామూహిక శ్రీమంతలు నిర్వహించిన మంత్రి సత్యవతి

సామూహిక శ్రీమంతలు నిర్వహించిన మంత్రి సత్యవతి

ముద్ర న్యూస్ రేగొండ:  రేగొండ మండలం గోరికొత్త పల్లి,మండల కేంద్రంలో తహసీల్దర్ కార్యాలయం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, కలెక్టర్ భావేశ్ మిశ్రా,జెడ్పీ చైర్పర్సన్ జక్కు హర్షిణి ,జ్యోతి,గార్ల కు ఆహ్వానం పలికిన అంగన్‌వాడీ టీచర్లు గోరికొత్త పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతల కార్యక్రమంలో  పాల్గొని శ్రీమంతలు నిర్వ.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. 

ఈ సందర్బంగా గర్బిణీలకు పండ్లు, పూలు అందజేసి ఆశీర్వదించారు. అనంతర మంత్రి సత్యవతి మాట్లాడుతూ మహిళలు, శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గర్బిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ జక్కు హర్షిణి,గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా,అంగన్ వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు