సమ్మె శిబిరంలో పొలాల అమావాస్య
ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాష్ట్ర విద్యా శాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు గురువారం 18వ రోజుకు చేరాయి. ధర్నా రోజు18వ రోజు నిరసన కార్యక్రమాలలో భాగంగా మట్టితో ఎద్దులను తయారు చేసి పొలాల అమావాస్య పండుగను జరుపుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎద్దుకు డిమాండ్ల పత్రాన్ని సమర్పించారు.