సహాయక చర్యల్లో వేగం పెంచాలన్న ప్రధాని
ఒడిశా: ఒడిశా ప్రమాదంపై సహాయక చర్యల్లో వేగం పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారంనాడు రైల్వేశాఖమంత్రికి ఫోన్లో ఆదేశించారు. దగ్గరుండి సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. అదే సమయంలో ప్రమాదం బారిన పడి గాయాలపాలైన వారికి అందించాల్సిన సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. ప్రమాదం అనంతరం శనివారం ప్రధాని మోడీ బాలేశ్వర్ఘటనా స్థలంలోని పరిస్థితిని పర్యవేక్షించారు. రైల్వేశాఖ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, వైద్యశాఖాధికారులు, మంత్రులతో మాట్లాడారు. గాయాలపాలైన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన ప్రధాని అదేరోజు రాత్రి ప్రమాదంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కవచ్ను వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంపై చర్చ జరిగినట్లు పలువురు వెల్లడించారు.