కూటమితో మోడీ దడ
- అందుకే పేరు మారుస్తున్నారు
- బలహీనమైన వారిపై దాడులను పురాణాలు బోధించలేదు
- ధరలు, దాడులు, కేంద్ర సంస్థలతో బీజేపీ బెదిరింపు
- ప్యారిస్లో ప్రధానిపై రాహుల్ఫైర్
ప్యారిస్: ఇండియా కూటమిని చూసి బీజేపీ, ప్రధాని మోడీ భయపడుతున్నారని అందుకే దేశం పేరును కాస్త భారత్గా మార్చి కూటమిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఆరోపించారు. యూరప్ పర్యటనలో భాగంగా ప్యారిస్లోని సైన్సెస్పో యూనివర్సిటీలో ‘90 మినిట్స్విత్రాహుల్గాంధీ’ అనే కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. తాను బీజేపీ కంటే పెద్ద హిందూత్వ వాదినని అన్ని ఉపనిషత్తులు, గీత, హిందూ పుస్తకాలు చదివానని రాహుల్ అన్నారు. బీజేపీ మాత్రం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు.
భారత్లోని అట్టడుగు, నిరుపేద, మధ్యతరగతి వర్గాలు పాలనపై ప్రశ్నిస్తుంటే వారి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. మరోవైపు మైనారిటీలపై దాడులు పెచ్చుమీరాయన్నారు. భారతదేశంలోని ఇలాంటివారి అభివృద్ధిని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాయని ఆరోపించారు. అట్టడుగు కులాలు, వెనుకబడిన కులాలు మరియు ఇతర మైనారిటీల వ్యక్తీకరణను ఆపడానికి బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. నిజమైన హిందువులు బీజేపీ వారు కాదని రాహుల్ అన్నారు. బలహీనమైన వారికి హాని కలిగించే ఏ నిర్వచనాన్ని హిందూ పురాణాలు బోధించలేదని అన్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం మాట వినని వారిపై దాడులకు పూనుకుంటోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను సైతం ప్రయోగిస్తోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా అక్రమ కేసులు బనాయిస్తూ వారిని నయానో, భయానో తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. భారత్లో 20 కోట్ల మంది ప్రజలు బీజేపీ పాలనతో తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇందులో మైనారిటీలు, సిక్కులు కూడా ఉన్నారన్నారు. మణిపూర్లో మహిళల పరిస్థితిని ఉద్దేశిస్తూ మహిళలపై కూడా దాడులు జరగడం శోచనీయం, దుర్మార్గమన్నారు.
మరోవైపు బీజేపీ పాలనలో ధరలు మండిపోతున్నాయని సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు. దేశంలో నిరుద్యోగంతో అనేకమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కళ్లప్పగించి చూస్తోందన్నారు. ఇన్ని సమస్యల మధ్య దేశంలోని హిందూత్వ ఏజెండాతోనే ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు చూస్తున్నాయని రాహుల్గాంధీ ఆరోపించారు. ఇక్కడి నుంచి నేరుగా రాహుల్గాంధీ నార్వే రాజధాని ఓస్లోకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న వలస కార్యక్రమంలో రాహుల్ మాట్లాడనున్నారు. 13వ తేదీన రాహుల్గాంధీ తిరిగి భారత్కు రానున్నారు.