రాహుల్ 'భారత్ జోడో' తోనే కర్ణాటకలో విజయం
![రాహుల్ 'భారత్ జోడో' తోనే కర్ణాటకలో విజయం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645f3d28a658f.jpg)
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ఎఐ సిసి అగ్రనేత రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర కీలక భూమిక పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో నాయకుల నుంచి కార్యకర్తల దాకా అందరినీ ఏకం చేయడానికి భారత్ జోడోయాత్ర దోహదం చేసిందని వారు అంటున్నారు.
చాలా కాలం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సిద్ధరామయ్య, శివకుమార్ లను తన పక్కన పెట్టుకొని రాహుల్ కర్ణాటకలో తన యాత్రను సాగించారు. దీనితో రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ ఐక్యంగా ఉన్నాయన్న సంకేతం వెళ్ళింది. సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కూడా భారత్ జోడోయాత్ర ప్రభావం చూపనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.