మెదక్ జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

మెదక్ జిల్లా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతులకు త్రీఫేస్ విద్యుత్ సరఫరాపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మండల, పట్టణ కేంద్రాలలో బుధవారం పెద్ద ఎత్తున ఆయన దిష్టి బొమ్మను బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో టీపిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బొమ్మను దగ్ధం చేయగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. జెడ్పిటిసి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా కేంద్రం మెదక్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

హవెలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఎఎంసి డైరెక్టర్ సాయిలు ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రైతులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని చిలిపిచెడ్, చేగుంట, రామాయంపేట్, కొల్చారం, మనోహరాబాద్, శివ్వంపేట్ మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.