విజృంభిస్తున్న హెచ్​3 ఎన్​2- ఆరుగురు మృతి

విజృంభిస్తున్న హెచ్​3 ఎన్​2- ఆరుగురు మృతి

న్యూఢిల్లీ: హెచ్​3 ఎన్​2(ఇన్​ఫ్లూయెంజా వైరస్​) వ్యాప్తి తీవ్రమవుతోంది. ఈ వైరస్​బారిన పడి ఇప్పటివరకూ భారత్​లో ఆరుగురు చనిపోయినట్లు వైద్యవర్గాలు స్పష్టం చేశాయి. పంజాబ్​, కర్ణాటక, హరియాణాల్లో ఈ వైరస్​ల వల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో వైరస్​బారిన పడి వీరంతా మరణించినట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా ఈ వైరస్​తో ఓ వ్యక్తి మృతిచెందాడు. వైరస్​విజృంభన నేపథ్యయంలో అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.