విజృంభిస్తున్న హెచ్3 ఎన్2- ఆరుగురు మృతి
న్యూఢిల్లీ: హెచ్3 ఎన్2(ఇన్ఫ్లూయెంజా వైరస్) వ్యాప్తి తీవ్రమవుతోంది. ఈ వైరస్బారిన పడి ఇప్పటివరకూ భారత్లో ఆరుగురు చనిపోయినట్లు వైద్యవర్గాలు స్పష్టం చేశాయి. పంజాబ్, కర్ణాటక, హరియాణాల్లో ఈ వైరస్ల వల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో వైరస్బారిన పడి వీరంతా మరణించినట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా ఈ వైరస్తో ఓ వ్యక్తి మృతిచెందాడు. వైరస్విజృంభన నేపథ్యయంలో అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.