ఘోర రోడ్డు ప్రమాదం భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

ఘోర రోడ్డు ప్రమాదం భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలకు క్రేన్ ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ పోర్టు రోడ్డుపై శివనగర్ సాయిబాబా కమాన్ సమీపంలో భార్యాభర్తలిద్దరూ ఆటో దిగారు. వరంగల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన క్రేన్ బలంగా ఢీ కొట్టింది. భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని వరంగల్​లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.