మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం..ఒకరు మృతి

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై  శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఈ ఘటనలో అనిల్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.