డిప్యూటీ సీఎం భట్టి డ్రైవర్‌పై చేయి చేసుకున్న పోలీసులు...

ముద్ర,తెలంగాణ:-హైదరాబాద్ శివారు తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ సభ వద్ద ఉన్న పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ ను లోపలికి అనుమతించలేదు. రాచకొండ సీపీ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.

కారును పక్కకు ఆపారు.అయితే డ్రైవర్ శ్రీనివాస్ వాహనానికి డయాస్ పాస్ ఉందని చెప్పినప్పటికీ సీపీ వినిపించుకోలేదు. శ్రీనివాస్ పై చెయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏసీపీతో కూడా కొట్టించారు. దీన్నంతటిని ఓ వ్యక్తి వీడియో తీశారు. ఆ వ్యక్తి పై కూడా పోలీసులు చెయి చేసుకున్నారు. మొబైల్ లాక్కున్నారు. అయినప్పటికీ అక్కడున్నవారు వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసుల తీరు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.