నటి నిరోషా ఇంట్లో చోరీ

నటి నిరోషా ఇంట్లో చోరీ


ముద్ర, తెలంగాణ బ్యూరో : సీనియర్ నటి నిరోషా ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని ఆమె ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయంటూ తేనంపేట పోలీసులకు నిరోషా ఫిర్యాదు చేశారు. నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాల కూడా కనిపించకుండా పోయాయని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈమధ్య కాలంలో సెలబ్రిటీల నివాసాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న ఘటనలు చూస్తున్నాం. ఐశ్యర్య రంజనీకాంత్, సింగర్ విజయ్ ఏసుదాస్, శోభన ఇళ్లలో చోరీ ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.