విద్యార్థికి షార్ట్ సర్క్యూట్.. పట్టించుకోని పాఠశాల యాజమాన్యం..

ముద్ర ప్రతినిధి, వరంగల్ : వరంగల్ హంటర్ రోడ్డు శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థికి శాపంగా మారింది. పదో తరగతి విద్యార్థిని కి విద్యుత్ షాక్ తగిలి అస్వస్థతకు గురైంది. రెండు రోజులైనా పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదు. కనీసం తల్లితండ్రులకు సైతం సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసింది. గతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోగా ప్రస్తుతం మిగతా వాళ్లు భయబ్రాంతులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పాఠశాల పై చర్యలు తీసుకోవాలని తల్లితండ్రుల వేడుకుంటున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయం లో బాధితురాలి కుడి చేతికి గాయమవడంతో  పరీక్ష ఎలా రాయాలో దిక్కు తోచని స్థితిలో విద్యార్థి ఆందోళన వ్యక్తం చేస్తోంది.