ఘనంగా సయ్యద్ సద్రుద్దీన్ షా ఉర్సు భక్తి శ్ర్ధలతో గందోత్సవం - నేడు దీపోత్సవం 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రం లోని నాగనూలు లో సయ్యద్ సద్రుద్దీన్ షా ఖాద్రీ రహమతుల్లా అలే ఉర్సు ఉత్సవాలలలో భాగంగా రాత్రి గంధోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు.  దర్గా ముతవల్లి షేక్ ఫహీమొద్దిన్ చిస్తిఉల్ ఖాద్రీ ఆధ్వర్యంలో  మహబుబ్ సుభాని వీధిలోని షేఖ్ నిరంజన్ నివాసం నుంచి గంధం బయలు దేరి భక్తి వచనాలు,డప్పు సాధనతో దర్గా వద్దకు గంధం చేకుంది. అనంతరం దర్గా వద్ద ఖవ్వాలి ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు,అన్న,ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.ఆదివారం ఉదయం భక్తులకు అన్నదానం నిర్వహించారు.  సోమవారం దర్గా వద్ద చిరాగా (దీపోత్సవం)తో పాటు ధార్మిక,ఆధ్యాత్మిక,అన్నదాన కార్య్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.