విద్యుత్ బాదుడుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
విద్యుత్ బాదుడుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు జరుగుతున్నాయి. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. బాపట్లలోని వేమూరు సబ్ స్టేషన్ ఎదుట నక్కా ఆనంద్ బాబు ధర్నా. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ విద్యత్ సబ్ స్టేషన్ ఎదుట నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి అరవింద్ బాబు ఆధ్వర్యంలో ధర్నా. పెదకూరపాడు సబ్స్టేషన్ ఎదుట కొమ్మాలపాటి శ్రీధర్ ధర్నా. గుంటూరులోని పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర నిరసన. గుజ్జనగుండ్లలో టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ధర్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల నినాదాలు చేస్తున్నారు.