అమరవీరులకు ఘన నివాళులు

అమరవీరులకు ఘన నివాళులు

రామకృష్ణాపూర్,ముద్ర : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రామాలయం చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యా సాగర్, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్బంగా అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు,కొ ఆప్షన్ సభ్యులు, రిసోర్స్ పర్సన్స్,సిబ్బంది పాల్గొన్నారు.