ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వాహణలో పోలింగ్ ఆఫీసర్ల భాధ్యత కీలకం

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వాహణలో పోలింగ్ ఆఫీసర్ల భాధ్యత కీలకం

 గుండాల ఏప్రిల్ 04 (ముద్ర న్యూస్) ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణలో పోలింగ్ ఆఫీసర్ల బాధ్యత కీలకమని జిల్లా ఎన్నికల శిక్షణ పరిశీలకుడు పెసరు లింగారెడ్డి అన్నారు.గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ పి ఓ లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు పరిశీలించి మాట్లాడుతూ.సిబ్బంది ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటిస్తూ,విధి నిర్వహణ చేసి విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

శిక్షణ కార్యక్రమంలో తహశీల్దార్ జల కుమారి మాస్టర్ ట్రైనర్స్. సంజీవరెడ్డి, తిరుపతి రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వెంకటేశ్వర్లు, నరేష్, జూనియర్ అసిస్టెంట్ నరేష్ ,సి ఆర్ పి దేవన బోయిన లింగయ్య., ఎం ఐ ఎస్ నరేష్, శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.