జూలై 16 నుంచి వింబుల్డన్ గ్రాండ్స్లామ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ చాంపియన్షిప్–2023 జూలై 3 నుంచి 16 వరకు టోర్నీ జరగనుంది. ఈసారి విజేతలకు రూ. 24 కోట్ల, 43 లక్షలు చొప్పున అందజేయనున్నారు. గతేడాది కంటే ఈసారి 3 లక్షల 50వేల పౌండ్లు ఎక్కువగా అందజేయనుండడం విశేషం. తొలిరౌండ్లో నిష్ర్కమించిన క్రీడాకారులకు 55వేల పౌండ్లు (57 లక్షల 18వేలు), క్వాలిఫయింగ్లో నిష్ర్కమిస్తే 13 లక్షల 25వేలు, రెండో రౌండ్లో ఓడితే రూ. 2 లక్షల 61 వేలు, మూడో రౌండ్లో ఓడితే 37 లక్షల 42 వేలు లభించనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి పురుషుల సింగిల్స్లో జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్లో రిబాకినా (కజికిస్తాన్)లు బరిలోకి దిగనున్నారు.