జూలై 16 నుంచి వింబుల్డన్​ గ్రాండ్​స్లామ్​

జూలై 16 నుంచి వింబుల్డన్​ గ్రాండ్​స్లామ్​

లండన్: వింబుల్డన్​ గ్రాండ్​స్లామ్​ టెన్నిస్​ చాంపియన్​షిప్​–2023 జూలై 3 నుంచి 16 వరకు టోర్నీ జరగనుంది. ఈసారి విజేతలకు రూ. 24 కోట్ల, 43 లక్షలు చొప్పున అందజేయనున్నారు. గతేడాది కంటే ఈసారి 3 లక్షల 50వేల పౌండ్లు ఎక్కువగా అందజేయనుండడం విశేషం. తొలిరౌండ్​లో నిష్ర్కమించిన క్రీడాకారులకు 55వేల పౌండ్లు (57 లక్షల 18వేలు), క్వాలిఫయింగ్​లో నిష్ర్కమిస్తే 13 లక్షల 25వేలు, రెండో రౌండ్​లో ఓడితే రూ. 2 లక్షల 61 వేలు, మూడో రౌండ్​లో ఓడితే 37 లక్షల 42 వేలు లభించనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్​ చాంపియన్స్​గా బరిలోకి పురుషుల సింగిల్స్​లో జొకోవిచ్​ (సెర్బియా), మహిళల సింగిల్స్​లో రిబాకినా (కజికిస్తాన్​)లు బరిలోకి దిగనున్నారు.