జడ్పిటిసి, వైస్ ఎంపీపీ పూజలు
![జడ్పిటిసి, వైస్ ఎంపీపీ పూజలు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64881ac72ba7b.jpg)
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జడ్పిటిసి మారపాక రవి, మండల వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డిలు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం చేసుకొని 41వరోజులు పూర్తి అయిన సందర్భంగా మొదటి అభిషేకం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కుంభారాధన, మూల మంత్ర హవనం శ్రీయాగం, మహా పూర్ణాహుతి, అనంతరం అమ్మవారికి ఘటాభిషేకం మరియు అలంకరణ, అర్చన, మహా నైవేద్యం పూజ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్లా ఉమ, ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డు సభ్యులు, ఆలయ ధర్మకర్తలు, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు జీడికంటి వరుణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.