పెబ్బేరులో రూ.2లక్షలు సీజ్

పెబ్బేరులో రూ.2లక్షలు సీజ్

ముద్ర, పెబ్బేరు : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో ఎలాంటి రశీదు లేకుండా తీసుకెళ్తున్న రూ. 2లక్షలను పెబ్బేరు పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేటిదొడ్డి మండలం నాగర్దొడ్డి గ్రామానికి చెందిన బండారి తిమ్మప్ప అనే గుంపు మేస్త్రీ, ముత్తయ్య, మత్తయ్య, ఏసేపులు ఇటుక బట్టీలలో పని చేస్తుంటారు.

వీరంతా అచ్చంపేటలోని ఇట్టుక బట్టీలో ఇటుకలు తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ క్రమంలోనే ఒక వాహనంలో వెళ్తుండగా పెబ్బేరు లోని కొల్లాపూర్ వెళ్లే కమాన్ వద్ద గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో వీరి వాహనంలో రూ. 2 లక్షలను గుర్తించారు. వాటికి సంబంధించిన రశీదులు ఏవీ వారి వద్ద లభ్యం కాకపోవడంతో ఆ డబ్బును సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.