బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మృతిచెందిన మేడిచెట్టి మల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వార వచ్చిన 5 లక్షల విలువ గల చెక్కును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మంగళవారం అందజేశారు.  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి  భరోసా కల్పించారు. బాధిత  కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ కు  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, పాక్స్ ఛైర్మెన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్య, ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి బాబు, ఎల్లారెడ్డిపేట గ్రామశాఖ అధ్యక్షులు బండారి బాలిరెడ్డి, BRS నాయకులు పొన్నాల మల్లారెడ్డి , మేడిచెట్టి శ్రీనివాస్ , నాగుల శ్రీనివాస్ ,మునిగే రాజయ్య , సంగేమ్ బాలయ్య ,గొట్టె శ్రీకాంత్, మరాఠి రాజు, మద్దెల మధు , గెంటే వెంకటేష్ , గెంటే మధు, పెద్దోళ్ల బాలు , సందెవేణి మల్లేశం, సందెవేణి ఎల్లయ్య తదితరులు  పాల్గొన్నారు.