ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి: కాంగ్రెస్ పార్టీ జీల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్

ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి: కాంగ్రెస్ పార్టీ జీల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్
District President Adi Srinivas

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య అధ్యక్షతన శనివారం స్థానిక ఫంక్షన్ హలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కార్యకర్తలు ఎన్నికలకు అదేవిధంగా పోరాటాలకు  సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రానున్న పది నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అత్యంత కఠినమైన సమయమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు.

ఇప్పటికైనా జిల్లా పక్షాన ఎల్లారెడ్డిపేట మండలంలో ఏ ఒక్క కార్యకర్తకు ఆపద వచ్చిన ముందు నిలబడి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం ఉంటుందని భరోసని ఇచ్చారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉందని వడ్ల సెంటర్లలో కానీ రైతు రుణమాఫీ మీద పోరాటం చేస్తుందన్నారు. కార్యకర్తల కోసం అహర్నిశలు తాము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కోస రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత,ఎస్సీ సెల్ అధ్యక్షులు బాలరాజు, నాయకులు గౌస్, లక్ష్మారెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి,లింగం గౌడ్, సాహెబ్, మర్రి శ్రీనివాసరెడ్డి,కనిక శ్రీనివాస్, రాజు నాయక్, రాజేందర్,చిన్ని బాబు, ముచ్చా గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.