బండి కి అమిషా, నడ్డా, స్మృతి ఫోన్

బండి కి అమిషా, నడ్డా, స్మృతి ఫోన్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ కారగారం నుండి విడుదలైన వెంటనే అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీలు ఫోన్ చేశారు. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా మీకు అండగా ఉందని బరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ కుట్రలను ఛేదిస్తూ దూసుకుపోవాలన్నారు. ప్రజా సమస్యలపై ఉదృతంగా పోరాటం చేయండి అన్నారు. అనంతరం తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో సహా జాతీయ నాయకులు ఫోన్ లో బండి సంజయ్ ని పరామర్శించారు