కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేతలు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు తడక రమేష్, కొయ్యడ శ్రీనివాస్,మైల ఐలయ్య, కొట్టం కరుణాకర్ రెడ్డి లు చేరారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కోఆర్డినేటర్ గునిగంటి రమేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గునిగంటి వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుక్క కుమార్ తదితరులు పాల్గొన్నారు.