నాన్ వెజ్ ప్రియులకు పండగలాంటి శుభవార్త

నాన్ వెజ్ ప్రియులకు పండగలాంటి శుభవార్త

ముద్ర,తెలంగాణ:- రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజుల సమయంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ చికెన్ ధర రూ.320 దాకా పలికింది. చాలామంది చికెన్ ధరలను చూసి లబోదిబో అన్నారు. ఎందుకంటే చాలామందికి వారాంతంలో ముక్క లేనిదే ముద్ద దిగదు కాబట్టి. అలాంటి వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో శుభవార్త అందింది.

అదేంటంటే.. చికెన్ ధరలు దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన ధరలు.. ఇప్పుడు మరింత తగ్గాయి. తాజాగా తెలంగాణలో కిలో చికెన్ ధర స్కిన్ లెస్ అయితే.. రూ.200 నుంచి రూ.210 వరకు ఉంది. కిలో చికెన్ స్కిన్ తో అయితే రూ.180 వరకు విక్రయిస్తన్నారు.అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి. వారం రోజుల నుంచి కిలో చికెన్ రూ.300 పెట్టి కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ ధరలు తగ్గడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.