బిఆర్ఎస్ లో చేరిన ఏఐటియూసి మండల అధ్యక్షుడు జంగ నర్సయ్య
![బిఆర్ఎస్ లో చేరిన ఏఐటియూసి మండల అధ్యక్షుడు జంగ నర్సయ్య](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_65250c560c8cb.jpg)
మోత్కూర్(ముద్ర న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు, తుంగతుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మోత్కూరు మండల ఏఐటియూసి మండల అధ్యక్షుడు జంగ నర్సయ్య మంగళవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో బిఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జంగ నర్సయ్య కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీ కోసం పని చేసే వారికి, కష్టపడే ప్రతీ కార్యకర్తను గులాబీ జెండా కడుపులో పెట్టీ చూసుకుంటుందని, పార్టీ గెలుపు కోసం శ్రమించే వారికి తన పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ లో చేరిన జంగ నర్సయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో అన్ని విధాలుగా జంగ నర్సయ్య కు అండ దండ గా ఉంటానన్నారు.ఈకార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యులు జంగశ్రీను,గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి పాల్గొన్నారు.