జడ్పీ నిధులతో బోరు మంజూరు

జడ్పీ నిధులతో బోరు మంజూరు


ముద్ర,తంగళ్లపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని కస్బె కట్కూర్ గ్రామంలోని చింతల పల్లె లో రూ.లక్ష జడ్పి నిధులతో బోర్ ఏర్పాటు పనులు చేపట్టారు.జెడ్పిటిసి పుర్మని మంజుల గ్రామస్తులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ఈ బోరు మంజూరు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, పూర్మాని లింగారెడ్డి,సర్పంచ్ వలకొండ వేణు గోపాల్ రావు, బిఆర్ ఎస్ నాయకులు అంకారపు రవీందర్,నవీన్ రావు,జంగిటి అంజయ్య,నీరటి బాబు,దేవేందర్ యాదవ్,శ్రీ వర్ధన్ చీమల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.