కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
- కాళోజి ఖ్యాతిని తెలిపేలా నిర్మాణం
- ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి ఉందని, కాళోజి ఖ్యాతిని తెలిపేలా నిర్మాణo ఉండాలని, కాళోజి కళాక్షేత్ర నిర్మాణం పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులపై బుధవారం రోజున కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో కాళోజి కళాక్షేత్రం వద్ద ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... కాళోజి కళాక్షేత్ర నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాళోజి ప్రాముఖ్యత, విశిష్టత చరిత్ర తెలిపేలా నిర్మాణ పనుల్లో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కళాక్షేత్రo నిర్మాణంలో సైతం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఆడిటోరియం నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కాళోజి విగ్రహం, చిత్ర మాలికలకు ప్రత్యేక స్థానాలను కేటాయించాలని సూచించారు. కాళోజి కళాక్షేత్రంలో కాళోజీ ఫౌండేషన్, కవి సమ్మేళనాలా నిర్వహణకు ప్రత్యేక సదుపాయం కల్పించాలని సూచించారు. కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆడిటోరియం, ఎంట్రెన్స్, సౌండ్ సిస్టం, సీటింగ్ పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని, కాళోజి కళాక్షేత్ర నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గతంలో సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయాక్, కూడా సీపీఓ అజిత్ రెడ్డి, డీఈఈ రఘునందన్ రావు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ రావు, నిర్మాణ బాధ్యులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.