రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిది - సీపీఐ నేత నారాయణ

రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిది - సీపీఐ నేత నారాయణ

ముద్ర,తెలంగాణ:-రాష్ట్ర చిహ్నం మార్పుపై సీపీఐ పార్టీ కీలక నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమన్నారు. కానీ రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిపై సర్కారు దృష్టి పెట్టాలని సూచించారు. సంగీతంలో బీఆర్ఎస్ ప్రాంతీయ వాదం లేవనెత్తడం సరికాదన్నారు. మోడీ ధ్యానం చేయడం.. కన్యాకుమారిని కలుషితం చేయడమే అన్నారు. కేంద్రంలో మోడీ రాకపోతే.. చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటా అన్నారు.