బిగ్ బ్రేకింగ్... కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బిగ్ బ్రేకింగ్...   కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న లాస్య నందిత స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

ఈనెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.