సీఎం కేసిఆర్ పర్యటన విజయవంతం మంత్రి పువ్వాడ
ఖమ్మం: ముఖ్యమంత్రి కేసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన విజయవంతం కావడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి ప్రజలు కేసిఆర్ కు మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటామనే సంకేతాన్ని కల్పించినందుకు జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు మరోమారు నిరూపితం చేశారని పేర్కొన్నారు.