రామయ్యపల్లెలో "దళిత బందు" విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..  

రామయ్యపల్లెలో "దళిత బందు" విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..  

వెల్గటూర్, ముద్ర: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో "దళిత బంధు " విషయంలో ఇరు వర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది.  గ్రామంలో గల కొందరికి ప్రభుత్వం "దళిత బంధు "యూనిట్ లను మంజూరు చేయగా, అర్హత ఉన్న మాకు దళిత బందు యూనిట్ లను ఎందుకు ఇవ్వలేదని గ్రామంలో గల కొందరు మహిళలు, యువకులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసినదే.

 కాగా ఈరోజు అదే గ్రామానికి చెందిన సిరిసిల్ల వినోద్, ప్రశాంత్ లు మహిళలతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకువెళ్లి ఆందోళన చేశారు. దీనితో గ్రామ కార్యదర్శి తో సిరిసిల్ల వినోద్,  ప్రశాంత్ లకు మధ్య మాట, మాట పెరిగింది. ఈ క్రమంలో ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నట్లు సమాచారం.