ఆలేరు చెక్ పోస్ట్ వద్ద రూ. 4లక్షల పట్టివేత

ఆలేరు చెక్ పోస్ట్ వద్ద రూ. 4లక్షల పట్టివేత

ముద్ర, ఆలేరు : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ఆలేరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా ఓ కారులో తరలిస్తున్న రూ.4లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.50వేలకు పైగా నగదు రవాణా చేస్తే సరైన ఆధారాలు చూపించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.