మల్యాల మండలంలో భారీ వర్షం...
![మల్యాల మండలంలో భారీ వర్షం...](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6416b88d333f6.jpg)
- రైతుల్లో ఆందోళన
- క్రాస్ రోడ్డు వద్ద పసుపు జలమయం
ముద్ర, మల్యాల: మల్యాల మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి మండలంలో మోస్తారుగా వర్షం కురువగా, ఈ రోజు రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దాంతో రోడ్లు, కాలువలు జలమయమయ్యాయి. చాలా సేపు విద్యుత్ అంతరాయo ఏర్పడింది. క్రాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారులు ఆరోబోసుకున్న పసుపు జలమయమైంది.
కాగా, అక్కడక్కడా కొద్దిగా రాళ్ళతో కూడిన వర్షం పడినట్లు పలువురు తెలిపారు. పలు జిల్లాల్లో అకాలవర్షం, వడగళ్ళవాన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారిచేసిన నేపథ్యంలో ఇక్కడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముక్యంగా మామిడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత సంవత్సరo కాత లేకపోవడంతో ఆయా గ్రామాల మామిడి రైతులు నష్టపోయారు. ఈ సారి ఆశలున్నప్పటికీ వడగళ్ళవాన రైతులను భయబ్రాంతులకు గురిచేస్తుంది.