కోటంచ హుండీ ఆదాయం 17 లక్షల 98వేలు

కోటంచ హుండీ ఆదాయం 17 లక్షల 98వేలు

ముద్ర న్యూస్: రేగొండ మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 17లక్షల 98 282 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ వెల్లడించారు. మర్చి 3 వ తేదీ నుండి 19 వరకు జాతర బ్రహ్మోశ్చావాలు నిర్వహించారు కాగా జాతర కు వచ్చిన భక్తులు కానుకలు సమర్పంచగా సోమవారం ఆలయ ఆవరణలో ఎండోమెంట్ డివిజన్ అబ్జర్వర్ డి. అనిల్ కుమార్ హుండీలను ఓపెన్ చేయగా. భక్తుల కానుకలను లెక్కించారు.

నగదుతో పాటు  మిశ్రమ బంగారం, రెండు కేజీల మిశ్రమ వెండి సమకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఛైర్పర్శన్ మాదడి అనిత కర్ణాకర్ రెడ్డి సర్పంచ్ పబ్బా శ్రీనివాస్ ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్ రావు ఆలయ కమిటీ సభ్యులు పోగు సుమన్ వెంకన్న శంకర్ రవి శ్రవణ్ సంపత్ రావు పబ్బ వెంకన్న గ్రామస్తులు పాల్గొన్నారు.