రాహుల్ అనర్హతకు నిరసనగా మెదక్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
![రాహుల్ అనర్హతకు నిరసనగా మెదక్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_642182d24a7ec.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడంపై మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. సోమవారం మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద జిల్లా అధ్యక్షులు కాంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ఈ దీక్షలో పీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య, పీసీసీ మెంబర్స్ సుప్రభాత రావు, మ్యాడం బాలకృష్ణ, మామిళ్ల ఆంజనేయులు, సోమేశ్వర్ రెడ్డి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పల్లె రాంచదర్ గౌడ్, శ్యామ్ సుందర్, రాజమణి, ప్రేమ్ కుమార్, మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు హఫీజ్ ఉద్దీన్, రమేష్ రెడ్డి,అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు