మెదక్ లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
- పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ మున్సిపల్ ప్రథమ చైర్మన్ సోమలింగం విగ్రహాన్ని మెదక్ పట్టణం పాత సాయిదీప్ ముందు మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సిపిఐ నాయకుడు కామ్రేడ్ కేవల్ కిషన్ విగ్రహాన్ని మెదక్ పట్టణం కోదండ రామాలయం ఎదురుగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, కమిషనర్ జానకిరామ్ సాగర్, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, జయరాజు, నాయకులు గూడూరి కృష్ణ గౌడ్, రాగి అశోక్, గడ్డమీది కృష్ణాగౌడ్, గూడూరి అరవింద్ గౌడ్, కొండ శ్రీనివాస్, సోమలింగం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏడుపాయల నవరాత్రి ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఏడుపాయలలో నిర్వహించనున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏడుపాయల్లో భక్తులకు వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ధర్మకర్తలు మానమ్మ కిషన్, సిద్ధిరాములు, వెంకటేశం, మనోహర్, నాగభూషణం, మోహన్రావు, సాయిలు, పెంటయ్య చక్రపాణి, రఘువీర్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.