ఆచార్య జయశంకర్ కు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని నివాళులు
![ఆచార్య జయశంకర్ కు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని నివాళులు](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64cf3c411f392.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయన ధృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదన్నారు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారన్నారు.ఈ కార్యక్రమంలో డి.సి.ఆర్.బి.సి.ఐ.సందీప్ రెడ్డి, ఎస్.బి.సి.ఐ.దిలీప్ కుమార్, జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.