గిరిజన లబ్ధిదారులకు మంత్రి చే ఇళ్ల పంపిణీ

గిరిజన లబ్ధిదారులకు మంత్రి చే ఇళ్ల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా: ఖానాపూర్ మండలం అడవి సారంగాపూర్ లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఇండ్లను సోమవారం  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,   జిల్లా పాలనాధికారి  వరుణ్ రెడ్డి, ఖానాపూర్ శాసన సభ్యురాలు    అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ లతో కలిసి  కోలాం గూడ లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్బంగా  అడవి సారంగాపూర్ లోని కోలాం గూడలో  15 ఇండ్లు, పివిటిజి  కోలాం కమ్యూనిటీ సి.సి.డి.పి.గ్రాంట్  ద్వారా  45 లక్షలతో   నూతన  గృహాలను  నిర్మించి  లబ్ధిదారులకు  అందించారు.