111 జీఓ ఎత్తివేత హర్షణీయం...

111 జీఓ ఎత్తివేత హర్షణీయం...
  • చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి.
  • సెక్రటేరియట్ లో సీఎం కేసిఆర్ ను కలిసిన ఎంపి, ఎమ్మెల్యేలు..

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :గత మూడు దశాబ్దాల పాటు చేవెళ్ల ప్రాంత ప్రజల అబివృద్దికి గుది బండగా ఉన్న 111 జీఓ ఎత్తి వెయ్యడం హర్షణీయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 111 జీఓ రద్దు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, స్థానిక ప్రజా ప్రతినిదులతో పాటు సోమవారం ఖైరతాబాద్ లోని సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా  కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా  ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ 111 జీఓ ఎత్తి వెయ్యడం తో జీఓ ప్రభావిత ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ జీఓ ఎత్తి వెయ్యడం తో చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజక వర్గ పరిధిలో ఉన్న దాదాపు 84 గ్రామాల ప్రజలకు అనేక రకాలుగా లబ్ది పొందనున్నట్టు అయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కే ఎస్ రత్నం, గణేష్ గుప్త, శివా రెడ్డి తదితరులు ఉన్నారు.