కాసులబాద్ తండాలో  గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రొటీన్ బాక్సుల అందజేత..

కాసులబాద్ తండాలో  గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రొటీన్ బాక్సుల అందజేత..
Charitable Trust Chairman Vishnuvardhan Reddy

ముద్ర, షాద్ నగర్:  చౌదర్ కూడా మండలంలోని  కాస్లాబాద్ తండాలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోటీన్ బాక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా పాలమూరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డతోపాటు పుట్టిన బిడ్డ సైతం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నిత్యం పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులను ఆహారంగా తీసుకోవాలన్నారు.

అనంతరం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటనలో బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం స్పందించి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, ఆకుల ప్రదీప్, మంగ విజయ్, మల్లేష్, కృష్ణ, భీమయ్య, గిరి,రాజ్‌కుమార్, నరేష్, జంగయ్య, శివ,గణేష్, రాజు, మురళి, నరేష్, యాదయ్య, రామ్, శ్రీను, చందు, ఓం ప్రకాష్, పర్వతాలు, నవీన్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.