వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులకు బియ్యం పంపిణీ

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులకు బియ్యం పంపిణీ

ముద్ర ప్రతినిధి భువనగిరి :ఫిబ్రవరి 29 లీఫ్ డే ని పురస్కరించుకొని గురువారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులకు,నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య, సెక్రెటరీ సుగ్గుల చంద్రశేఖర్, కోశాధికారి సోమ బనారస్, క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ పోకల సోమన్న, క్లబ్ సభ్యులు పద్మాల ప్రభాకర్, కోడితల కరుణాసాగర్, మిత్తింటి భాస్కర్, చీకటిమల్ల శ్రీకాంత్, పులిగిల్ల సత్యనారాయణ, బల్లి సోమశేఖర్, తాటిపల్లి రవీందర్, బాలేష్ పాల్గొన్నారు.