మురికి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్

మురికి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : పట్టణంలోని ఆజాద్ రోడ్డు వద్ద మురికి కాలువ నిర్మాణ పనులను  మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన  ఆంజనేయులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండిఏ  నిధులతో అంతర్గత మురికి కాలువ నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. భువనగిరి  శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి సహకారంతో పట్టణంలో సిసి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు.