రాష్ట్రాభివృద్ధి బిఆర్ఎస్ తోని సాధ్యం...
![రాష్ట్రాభివృద్ధి బిఆర్ఎస్ తోని సాధ్యం...](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_65438b817f553.jpg)
- ఆలోచించి ఓటు వేయాలి:
- భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
- బిఆర్ఎస్ లో చేరిన డిసిసి ప్రధాన కార్యదర్శి
ముద్ర ప్రతినిధి భువనగిరి :రాష్ట్ర అభివృద్ది బి ఆర్ ఎస్ తోనే సాధ్యమవుతుందని ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బొల్లెపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను కారు గుర్తుపై ఓటు వేయాలని అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని, గడపగడపకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని అనారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బిఆర్ఎస్ లో చేరిన డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి..
బొల్లెపల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి బిఆర్ఎస్ ఇంచార్జ్ లు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, ఎడ్ల సత్తిరెడ్డి, బీరు మల్లయ్య, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్, గ్రామ సర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, నాయకులు బల్లేపల్లి అశోక్, సందెల సుధాకర్, నాగేంద్రబాబు, రాకల శ్రీనివాస్, వనం రమేష్, వెంకటరెడ్డి, రాజు, కొండ మాధవరెడ్డి పాల్గొన్నారు.