ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మండలంలోని పనకబండ గ్రామంలో రిజర్వు బ్యాంకు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు .బ్యాంకులపై ఉన్న అభద్రత భావాన్ని తొలగించి ,ఖాతా తెరిచే సమయంలో బ్యాంకుకు సమర్పించవలసిన పత్రాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ఇన్సూరెన్స్ , బడ్జెట్ మరియు రుణం డిపాజిట్ ఖాతాల గురించి సైబర్ క్రైమ్స్ గురించి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలేష్ ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ నరేష్ ,ఏపీజీవీబీ ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు, అకౌంటెంట్ సత్యవర్షిని, క్యాషియర్ నాగార్జున ,డిస్టిక్ కో ఆర్డినేటర్ నాగరాజు, కౌన్సిలర్లు మహేష్, యుగంధర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.