బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై యువ బీజేపీ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ లో ఉన్న నేతలు బీజీపీలో చేరాలని నేను పిలుపు ఇస్తున్నా అని అన్నారు. ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ యుగపురుషుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని , బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం  సుభిక్షంగా ఉంటుందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ లో ఒక సైనికుడిలా పని చేస్తానని తెలిపారు