మంథని పట్టణంలో ఓపెన్ జిమ్ నూతన కార్యవర్గం ఎన్నిక - అధ్యక్షునిగా కూర కోటేష్
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని పట్టణంలో ఓపెన్ జిమ్ నూతన కమిటీ అధ్యక్షునిగా కూర కోటేష్ ను, ప్రధాన కార్యదర్శిగా జనగామ వెంకట రమణారావు ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మంథని పట్టణం ఓపెన్ జిమ్ వద్ద నూతన కార్యవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించగా, నూతన కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షునిగా మందల సత్యనారాయణ రెడ్డి, అధ్యక్షునిగా కూర కోటేష్, ప్రధాన కార్యదర్శిగా జనగామ వెంకట రమణారావు, ఆర్థిక కార్యదర్శిగా అప్పాల పోచ మల్లయ్య, ఉపాధ్యక్షులుగా వోల్లాల శంకర్ లింగం, వరాల ఉషారాణి, మాచడి కృష్ణ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మాచిడి కృష్ణగౌడ్, మంథని వేణు, ఐత రాజేష్ కుమార్, నారమళ్ళ లక్ష్మణ్, వడ్లకొండ శంకర్ మీడియా కన్వీనర్ గా దొరగోర్ల రవీందర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కూర కోటేష్ మాట్లాడుతూ సభ్యులందరినీ కలుపుకుంటూ ఓపెన్ జిమ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ కమిటీకి ఓపెన్ జిమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.