ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

ఆలేరు, ముద్ర: ఆలేరు మండలంలోని గోలనుకొండ గ్రామంలో గల శంబులింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్టపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ధ్వజస్థంభం వద్ద, యాగ శాల వద్ద శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉండేలా భగవంతుడు చూడాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల బీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వామివారి భక్తులు పాల్గొన్నారు.